Pawan Kalyanపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-01-26 12:00:47  IST  )

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్‌కూ, కేఏ పాల్‌కు తేడాలేదని అని ఎద్దేవా చేశారు...

Pawan Kalyanపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్‌కూ, కేఏ పాల్‌కు తేడాలేదని అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం, చట్టం అంటే పవన్‌కు తెలియదని విమర్శించారు. పవన్ అన్నీ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని బొత్స వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే పవన్‌కు బాధేంటని ప్రశ్నించారు. పవన్‌ను చూస్తుంటే రాజకీయాలపై విరక్తి వస్తోందన్నారు. పవన్ బస్సు యాత్రను ఎవరు అడ్డుకున్నారని నిలదీశారు. తమ పార్టీ విధానం వికేంద్రీకరణ అని, మూడు రాష్ట్రాలని అనలేదని పేర్కొన్నారు. మూడు రాజధానులు అని మాత్రమే అన్నామని మంత్రి బొత్స తెలిపారు.

ఇవి కూడా చదవండి: ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండి : Sajjala Ramakrishna Reddy

Darshi News: వైసీపీ ఎమ్మెల్యే వేణుగోపాలరావు పరుగో పరుగో...!

Ap News: అమరావతిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

Next Story